తమన్నా, ప్రభుదేవా సినిమాలో కనిపించనున్న ప్రభాస్

  • June 27, 2017 / 01:00 PM IST

బాహుబలి తర్వాత సాహో సినిమాపై ప్రభాస్ దృష్టి పెట్టారు. ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కోసం ప్రభాస్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి కంటే ప్రభాస్ గెస్ట్ రోల్ చేయనున్నట్లు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మిల్కీ బ్యూటీ తమన్నా హిందీలో కామోషి అనే సినిమా చేస్తోంది. ఇందులో తమన్నా లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రభుదేవా కీలక రోల్లో కనిపించనున్నారు. దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీలో ప్రభాస్ గెస్ట్ రోల్ పోషించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తమన్నా, ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి రెబల్, బాహుబలి సినిమాల్లో కలిసి నటించారు. ఈ స్నేహం కోసం ప్రభాస్ గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

ఈ విషయం పై ఆ చిత్ర నిర్మాత వశు భగ్నానీ ని సంప్రదించగా… ప్రభాస్ రోల్ గురించి సస్పెన్స్ లో పెట్టారు. “కామోషీలో ప్రభాస్ నటించడంపై నో కామెంట్. సినిమా అయితే దాదాపు పూర్తి అయింది. త్వరలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం. రిలీజ్ అయినా తర్వాతే మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది” అని చెప్పారు. ఇది వరకు ప్రభాస్ బాలీవుడ్ సినిమా యాక్షన్ జాక్సన్ కాసేపు కనిపించారు. మరి కామోషి లో మెరుస్తారా? లేదా? అనేది కొన్ని రోజుల్లో తెలియనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus