క్రేజీ సీక్వెల్ లో ప్రభాస్.. వర్కౌట్ అయితే హాలీవుడ్ రేంజే..!

  • October 28, 2020 / 06:44 PM IST

‘ధూమ్’ సిరీస్ కు ఎంత మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే మూడు సీక్వెల్స్ వచ్చాయి. అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించాయి. ఎ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ అని లేదు.. ఈ సీక్వెల్స్ కు అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయారు. ప్రస్తుతం అందరి చూపు ‘ధూమ్4’ పైనే ఉంది. మొదట సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్టులో నటిస్తాడని జోరుగా ప్రచారం జరిగింది.కానీ కారణాలేంటో తెలీదు కానీ..

ఆయన ఈ ప్రాజెక్టు పై అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఇప్పుడు ‘ధూమ్4’ ను కచ్చితంగా రిచ్ గా తెరకెక్కించాల్సి ఉంది. ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ వారు కూడా 600కోట్ల వరకూ బడ్జెట్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే బాలీవుడ్ ను మాత్రమే నమ్ముకుని అంత పెద్ద మొత్తం పెట్టడమనేది కరెక్ట్ కాదు. కచ్చితంగా ఆ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలి. అందుకే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ అయితేనే.. ఈ భారీ ప్రాజెక్టుకి కరెక్ట్ అని వారు భావిస్తున్నారట. నిజానికి ‘బాహుబలి'(సిరీస్) తరువాత వచ్చిన ‘సాహో’ పెద్ద హిట్టయితే కాదు.

కానీ బాలీవుడ్లో అది 125కోట్ల పైనే షేర్ ను వసూల్ చేసి రికార్డులు సృష్టించింది. ఇక వరల్డ్ వైడ్ గా 240కోట్ల వరకూ షేర్ ను వసూల్ చేసింది. ఆ చిత్రం ప్రభాస్ రేంజ్ ను మరింతగా పెంచింది.కాబట్టి ‘ధూమ్4’ ప్రభాస్ తోనే తెరకెక్కించాలని నిర్మాత ఎదురుచూస్తున్నాడని తెలుస్తుంది. ‘బాహుబలి2’ విడుదలైనప్పటి నుండీ ఆదిత్య చోప్రా అదే పనిలో ఉన్నాడట. అయితే ప్రస్తుతం ప్రభాస్ 3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అవి పూర్తయితేనే కానీ.. ‘ధూమ్4’ ఓకే అవుతుందని చెప్పలేము.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus