ప్రభాస్ ఫోటోషూట్ దేనికోసం..!!

  • June 7, 2016 / 12:02 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ పేరు బాహుబలిగా మారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. బాహుబలి ది బిగినింగ్ లో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి గా ప్రభాస్ ప్రదర్శించిన నటనకు సలాం చేశారు. ఈ చిత్రం ఒప్పుకున్న దగ్గర నుంచి ప్రభాస్ తన సొంత ఫోటోలను ఎప్పుడు మీడియాకు ఇవ్వలేదు. వేరే కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. కానీ మంగళవారం తన లేటెస్ట్ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. చాలా కాలం తర్వాత తమ డార్లింగ్ ఫోటో చూసే సరికి అభిమానులు కుష్ అయిపోయారు. అయితే ఈ ఫోటోలు ఎందుకు తీసారు.. అనే విషయం ప్రభాస్ చెప్పక పోవడంతో .. చర్చకు తెరలేసింది. ఈ ఫోటోలలో తమన్నా కూడా ఉండడంతో ఏమైనా వాణిజ్య ప్రకటనలో ఇద్దరూ కలిసి నటించారా? అనే సందేహాలు వ్యక్తం చేశారు.

ఈ ఫోటోలు చైనీయుల కోసమని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. “ఎస్ ఎస్ రాజమౌళి అపూర్వ సృష్టి అయిన బాహుబలి జపాన్ లో విడుదలైనప్పుడు సరిగా ప్రచారం జరపనందున అక్కడ ప్రజలకు చేరుకోలేక పోయింది. ఈనెల చైనాలో బాహుబలి రిలీజ్ కానుంది. జపాన్ విషయంలో చేసిన తప్పు ఇప్పుడు చేయకూడదని చిత్రం బృందం భావిస్తోంది. అందుకే కొన్ని రోజుల క్రితం చైనా జర్నలిస్టులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినిమా విశేషాలను వివరించింది. ఇప్పుడు ప్రభాస్, తమన్నా ఫోటోలను విడుదల చేసింది.” అని వారు చెప్పారు. ఈ ఫోటోలపై సస్పెన్స్ ని చిత్ర బృదం రివీల్ చేసే వరకు అభిమానులకు నిద్ర పట్టదేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus