అభిమానులను నిరాశపరచకుండా ప్రభాస్ కొత్త ప్లాన్!

  • February 5, 2018 / 05:47 AM IST

ప్రభాస్ ఐదేళ్ల పాటు రెండే సినిమాలు చేశారు. అభిమానులు మొదట కోపంగా ఉన్నా బాహుబలి చిత్రాలు సూపర్ హిట్ కావడంతో చాలా ఆనందపడ్డారు. బాహుబలి తర్వాత ప్రభాస్ వేగంగా సినిమాలు చేస్తారని అనుకున్నారు. కానీ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో మూవీ ఈ ఏడాది కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో మళ్ళీ కోపంగా ఉన్నారు. ఈ విషయం ప్రభాస్ వరకు చేరింది. తన ఫ్యాన్స్ కోపాన్ని చల్లార్చాలని మంచి ప్లాన్  వేశారు. సాహో సినిమా భారీ బడ్జెట్ సినిమా. పైగా ఏకకాలంలో మూడు భాషల్లో తెరకెక్కుతోంది. భారీ తారాగణం ఉంది. ప్రొడక్షన్ కి ఎంత సమయం పడుతుందో.. పోస్ట్ ప్రొడక్షన్ కి కూడా అంత సమయం పడుతుంది.

ఆ చిత్రాన్ని పరిగెత్తిస్తే అవుట్ ఫుట్ లో తేడా వస్తుంది. అందుకే అటు సుజీత్ ని కంగారు పెట్టించకుండా.. అభిమానులు నిరాశపడకుండా.. తాను కష్టపడడానికి సిద్ధమయ్యారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ తో సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నారు. స్క్రిప్ట్ రెడీగా ఉన్న ఈ చిత్రాన్ని కృష్ణం రాజు నిర్మించడానికి రెడీగా ఉన్నారు. వారిద్దరికీ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే నెలలలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి మూడు నెలలలో కంప్లీట్ చేయాలనీ రాధాకృష్ణకు ప్రభాస్ చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఈ వార్త నిజమైతే.. ప్రభాస్ అభిమానులకు పండుగే పండుగ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus