Radhe Shyam: రీషూట్ చేయమంటున్న ప్రభాస్..?

  • April 14, 2021 / 03:16 PM IST

ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ పాట షూటింగ్ ఇంకా పెండింగ్ లోనే ఉందని తెలుస్తోంది. ఇప్పుడు ఆ పాటను చిత్రీకరించాలా..? లేక పక్కన పెట్టేయాలా అనే డైలమాలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. అయితే ప్రభాస్ మాత్రం ఆ పాటను షూట్ చేద్దామని అంటున్నాడట. అదొక రొమాంటిక్ సాంగ్.. ఆ పాటను యాడ్ చేస్తే సినిమాకి ఇంకాస్త ఎక్కువ రొమాంటిక్ ఫీల్ వస్తుందని.. కాబట్టి ఆ పాట తీయాలని ప్రభాస్ చెబుతున్నాడట.

ఈ సినిమా బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆ పాట పెట్టడానికే మొగ్గు చూపుతున్నారు. అయితే యూవీ క్రియేషన్స్ నిర్మాతలు మాత్రం వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువైంది. కరోనా వలన వడ్డీలు కూడా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో మరో సాంగ్ అంటే ఖర్చు ఇంకా పెరిగిపోతుంది. స్పెషల్ గా సెట్ వేయాలి, హీరోయిన్ కాల్షీట్స్ తీసుకోవాలి. కనీసం ఐదు రోజుల పాటు షూటింగ్ నిర్వహించాలి. మళ్లీ గ్రాఫిక్స్ అదనపు ఖర్చు.

ఇది కాకుండా.. ప్రభాస్ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమని అడుగుతున్నాడట. తన సోలో సీన్స్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ని రీషూట్ చేస్తే ఇంకా బాగా వస్తాయని చెబుతున్నాడట. ఈ విషయంలో దర్శకనిర్మాతలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కానీ ప్రభాస్ స్వయంగా అడుగుతున్నాడు కాబట్టి పాటను చిత్రీకరించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే.. ‘రాధేశ్యామ్’ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాదేమోననే సందేహాలు కలుగుతున్నాయి.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus