ప్రభాస్ తో సినిమా చేయనున్న బాలీవుడ్ డైరక్టర్ ?

  • June 23, 2017 / 12:05 PM IST

‘బాహుబలి’ చిత్రంతో  ప్రభాస్‌ ఇండియన్ స్టార్ గా ఎదిగిపోయారు. ఆయనతో సినిమా చేయాలనీ బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే వారందరీని పక్కనపెట్టి తన మిత్రుల బ్యానర్లో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం యువీ క్రియేషన్స్ బ్యానర్లో సాహో మూవీ చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలయింది. ముంబై లో జరిగే షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ కానున్నారు. ప్రస్తుతం ముంబై లో ఉన్న ప్రభాస్ రహస్యంగా బాలీవుడ్ డైరక్టర్ సాజిద్‌ నదియాద్‌వాలాను కలిసి సినిమా విషయాలు చర్చించినట్లు బాలీవుడ్‌ వర్గాల వారు చెప్పుకుంటున్నారు.

ఈ డైరక్టర్ స్టార్ కిడ్ అయిన టైగర్‌ష్రాఫ్‌, కృతి సనన్‌లాంటి యువ నటీనటుల్ని బాలీవుడ్‌ కి పరిచయం చేశారు. ఇప్పుడు సాజిద్‌ ప్రభాస్‌ను బాలీవుడ్‌కి పరిచయం చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి కరణ్ జోహార్ సిద్ధంగా ఉన్నారు. అతని సలహా మేరకు ప్రభాస్, డైరక్టర్ సాజిద్‌ ని కలిసినట్లు సమాచారం. ఆయన చెప్పిన స్టోరీ ప్రభాస్ కి నచ్చితే బాలీవుడ్ ఎంట్రీకి అంతా రెడీ అయినట్లే.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus