రెమ్యునరేషన్ కన్నా కథ ముఖ్యమన్న ప్రభాస్!

  • October 23, 2017 / 07:06 AM IST

బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ కి దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఆయన సినిమా అంటే క్రేజ్ ఏర్పడింది. అందుకే నిర్మాతలు ప్రభాస్ డేట్స్ కోసం బారులు తీరారు. ఒక నిర్మాత అయితే ఎవరూ ఊహించని రెమ్యునరేషన్ ఆఫర్ చేసారంట. అయినప్పటికీ ప్రభాస్ ఒప్పుకోలేదు. ఈ విషయాన్నీ స్వయంగా రెబల్ స్టార్  కృష్ణంరాజు వివరించారు. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నిన్న కృష్ణం రాజు మీడియా ముందుకు వచ్చి ఆసక్తికర సంగతులు వెల్లడించారు. “తెలుగు, హిందీలో సినిమా తీస్తామని ఈ మధ్య కొందరు ప్రభాస్‌ని సంప్రదించారు. ఎవరూ ఊహించనంత డబ్బులు ఇస్తామన్నారు.

అందుకు ప్రభాస్ “సరిపడా డబ్బులు ఇస్తావు సరే, ఈ సినిమా నువ్వు సరిగా తీయకపోతే.. డబ్బులిచ్చాను కదా అనుకుని నీ ఇష్టమొచ్చిన కథ తీసుకుంటే..? నాకు కావాల్సింది పారితోషికం కాదు. నువ్వు, నీ కథ. ఫస్ట్ నాకు కథ వినిపించు. కథ మీద, నీ మీద నమ్మకం కుదిరితే నేను నటిస్తా. కేవలం భారీ పారితోషికం కోసం నటించను” అని  ప్రభాస్ స్పష్టం చేసినట్లు కృష్ణంరాజు వివరించారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమా తరవాత చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus