రెమ్యూనరేషన్ కోసం తిప్పించుకునే వాళ్లే ఎక్కువ : ప్రియమణి

  • April 7, 2020 / 12:41 PM IST

‘ఎవరే అతగాడు’ చిత్రంతో టాలివుడ్ కు పరిచయం అయ్యింది ప్రియమణి. అయితే ఆమెకు ‘పెళ్ళైన కొత్తలో’ చిత్రంతోనే మంచి గుర్తింపు దక్కింది. ఆ వెంటనే రాజమౌళి ‘యమదొంగ’ చిత్రంలో ఛాన్స్ కొట్టేసి ఆమె క్రేజ్ ను మరింతగా పెంచుకుంది. దీంతో ‘నవ వసంతం’ ‘హరే రామ్’ ‘ద్రోణ’ ‘మిత్రుడు’ ‘శంభో శివ శంభో’ ‘గోలీమార్’ ‘రగడ’ వంటి క్రేజీ చిత్రాల్లో ఆఫర్లు దక్కించుకుంది. అటు తరువాత కొత్త భామలు ఎంట్రీ ఇవ్వడం ఈమెకు ఆఫర్లు తగ్గడం వంటివి జరిగాయి.

దీంతో తమిళ, కన్నడ ఇండస్ట్రీల వైపు మళ్ళింది. పెళ్ళైన తరువాత సినిమాలు తగ్గించిన ఈ బ్యూటీ గత కొన్నాళ్లుగా వెబ్ సిరీస్ లు అలాగే రియాలిటీ షో లు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో వెంకటేష్ ‘నారప్ప’ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ పై చేసిన కామెంట్స్ పెద్ద వైరల్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ…”దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్ల టాలెంట్ కి తగిన పారితోషికాలు అందడం లేదు.

నయనతార .. అనుష్క .. సమంత వంటి కొందరికే భారీగా పారితోషికాలు అందుతున్నాయి .. అంతే వారికే సరైన గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. మధ్యతరగతి హీరోయిన్ల పరిస్థితి చాలా దారుణంగా వుంది. వారికి ఇస్తున్న పారితోషికాలు చాలా తక్కువ. చాలామందికి కనీస పారితోషికం కూడా అందడం లేదు. ముందుగా ఇస్తామన్న పారితోషికాలు కూడా ఇవ్వకుండా వారి చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఈ కారణంగా ఇబ్బందులు పడుతున్నవారి విషయంలో స్టార్ హీరోలు .. హీరోయిన్స్ స్పందించవలసిన అవసరం చాలా వుంది” అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus