ఆడవాళ్లు పొట్టి పొట్టి డ్రెస్సులు ఎందుకు వేసుకోవాలి అన్నాడు : ప్రియమణి

  • October 31, 2020 / 03:05 PM IST

ఈ టీవీ ఛానెల్లో ప్రసారమయ్యే ‘ఢీ’ డ్యాన్స్ రియాలిటీ షోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.ఇది కాస్త సర్కస్ షోని తలపించినా కానీ ఆధ్యంతం ఎంటర్టైన్ చేసే విధంగానే సాగుతుంటుంది. ప్రతీవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కు సంబంధించి ముందుగా ప్రోమోలను విడుదల చేస్తుంటారు. తాజాగా నవంబర్ 4న ప్రసారమయ్యే క్వార్టర్ ఫైనల్స్ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమోను కూడా విడుదల చేశారు షో నిర్వాహకులు. ఈ నేపథ్యంలో ఓ కంటెస్టెంట్ పవన్ కల్యాణ్…

‘వకీల్ సాబ్’ లోని ‘మగువా మగువా..’ పాటకు ఓ గ్రూప్ పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు. దీనిని చూసిన వారంతా ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో ప్రియమణి, రష్మి… కన్నీళ్ళు పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రియమణి మాట్లాడుతూ.. “ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూ చూసాను. అందులో ఒకతను మాట్లాడుతూ.. ‘ఆడవాళ్లు ఎందుకు పనిచెయ్యాలి? అనే ప్రశ్న వేసాడు. అమ్మాయిలు తమ శరీరం కనిపించేలా పొట్టి పొట్టి డ్రెస్సులు ఎందుకు వేసుకోవాలి. వాళ్ళు ఇంట్లోనే ఉండొచ్చుగా’ అని చెప్పాడు.

ఆ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసిన జెంట్స్ అంతా ఇలాగే మాట్లాడారు” అంటూ చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. నవంబర్ 4న టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లో ప్రియమణి.. మహిళల పట్ల పురుషులకు ఎటువంటి అభిప్రాయాలు ఉంటాయి అనే విషయాన్ని తెలియజేసే అవకాశం ఉందని తెలుస్తుంది.


‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus