కంగనా సెంటిమెంట్ తమన్నా విషయంలో రిపీట్ కాబోతుందా..?

  • February 2, 2019 / 10:57 AM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా నటించిన తాజా చిత్రం ‘మణికర్ణిక’. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చినప్పటికీ.. కలెక్షన్లు పెద్దగా రావడం లేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని.. 75 శాతం నేనే పూర్తిచేసానని.. కంగనా జస్ట్ ప్యాచ్ వర్క్ మాత్రమే చేసిందని.. డైరెక్టర్ కెరీష్ ఆరోపణలు వ్యక్తం చేసాడు. ఈ చిత్రం మొదలు పెట్టినప్పటి నుండీ రక రకాల వివాదాలు చోటు చేసుకున్నాయి. కంగనాతో వివాదాలు చోటు చేసుకోవడం వల్లే ప్రాజెక్ట్ నుండీ తప్పుకున్నట్టు క్రిష్ వెల్లడించాడు.

ఇప్పుడు ఇదే సెంటిమెంట్ టాలీవుడ్ లో కూడా రిపీట్ కాబోతున్నట్టు కనబడుతుంది. వివరాల్లోకి వెళితే.. కంగనా నటించిన సూపర్ హిట్ మూవీ ‘క్వీన్’ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని ‘దటీజ్ మహాలక్ష్మి’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని సగానికి పైనే దర్శకుడు నీలకంఠ డైరెక్ట్ చేసాడట. అయితే తమన్నా తో గొడవ కారణంగా.. ఈ చిత్రం నుండి నీలకంఠ తప్పుకున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ‘అ!’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పూర్తి చేస్తున్నాడు. ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్ర క్రెడిట్ అంతా తనకే దక్కుతుందని తాజాగా నీలకంఠ.. తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నాడట.

మరోపక్క ఈ చిత్రాన్ని పూర్తి చేస్తున్న ప్రశాంత్ వర్మ కూడా తనకే ఈ చిత్ర క్రెడిట్ దక్కుతుందని భావిస్తున్నాడట. ఈ క్రమంలో తమన్నా మాట్లాడుతూ… ‘దటీజ్ మహాలక్ష్మి చిత్రం నుండి నీలకంఠ తప్పుకోవడం లో తన ప్రమేయం లేదని… ఆయన సినిమా నుండి తప్పుకున్న తర్వాత కూడా నాతో స్నేహంగానే ఉంటున్నారని తమన్నా చెప్పుకొచ్చింది . ‘మణికర్ణిక’ విడుదల సమయంలో క్రిష్ పై కంగనా కూడా ఇలానే స్పందించింది. అయితే ‘మణికర్ణిక’ విడుదల తర్వాత పరిస్థితి ఎలా మారిందో.. అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే పరిస్థితి ‘దటీజ్ మహాలక్ష్మీ’ చిత్ర విషయంలో కూడా రిపీట్ కాబోతున్నట్టు కనిపిస్తుంది. చివరికి ఏం జరుగుతుందో చూడాలి మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus