సినిమా రిలీజ్ టైంలో మేకర్స్ టెన్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా నిర్మాతలకి నిద్ర పట్టదు. సరైన టైంకి కాపీ వెళ్లిందా? లేదా? అని ఒక వైపు.. ఫైనాన్సియల్ సెటిల్మెంట్లు మరో వైపు.. ఇలా చాలా రకాల టెన్షన్లు వారి మైండ్లో ఉంటాయి. వాటి వల్ల ఒత్తిడి ఫీలైతే అనారోగ్య సమస్యలు కూడా వచ్చి పడతాయి. ఇప్పుడు ఓ నిర్మాత పరిస్థితి అలాగే అయ్యింది.
వివరాల్లోకి వెళితే.. ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) నిర్మాత ఏ ఎం రత్నం (AM Rathnam) కళ్ళు తిరిగి పడిపోయారు. ఈరోజు ఉదయం 5 గంటల తర్వాత ఆయన ఆఫీసుకు వెళ్లగా టెన్షన్ కారణంగా హై బీపీ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయారట. దీంతో సిబ్బంది అతన్ని ఒమేగా హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైద్యులు ఏ.ఎం.రత్నం హై బీపీ, హై ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలిపారు.
అలాగే జాగ్రత్త వహించాలని… టైంకి తిండి, నిద్ర అవసరం అని.. చెప్పి ఆఫీస్ కి పంపించారట. అలాగే ఆయన్ని వైద్యుల సంరక్షణలో ఉంచాలని కూడా సిబ్బందికి, ఫ్యామిలీకి సూచించినట్టు తెలుస్తుంది. రత్నం ఆఫీస్ పక్కనే ఒమేగా హాస్పిటల్ ఉండటం వల్ల… సకాలంలో వైద్యం అందించగలిగినట్టు సిబ్బంది తెలిపారు.
‘హరిహర వీరమల్లు’ సినిమా జూన్ 12న రిలీజ్ కానుంది. 5 ఏళ్ళు షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా.. ఎట్టకేలకు రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి ఏ.ఎం.రత్నం దాదాపు రూ.200 కోట్లు బడ్జెట్ పెట్టారు. రిలీజ్ టెన్షన్ల కారణంగానే ఆయన కళ్ళు తిరిగి పడిపోయినట్టు స్పష్టమవుతుంది.