Puneeth Rajkumar: తెరపై పునీత్ ని చూసి ఎమోషనల్ అవుతోన్న ఫ్యాన్స్!

  • March 18, 2022 / 12:20 AM IST

కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త తెలుసుకున్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నడిగులు దేవుడిలా చూసే పునీత్ రాజ్ కుమార్ కన్నుమూయడం జనాలు తట్టుకోలేకపోయారు. మార్చి 17న ఆయన పుట్టినరోజు. ఆయన అభిమానులు పునీత్ బర్త్ డే ఎంతో గ్రాండ్ గా జరిపేవారు. కానీ ఇప్పుడు ఆయన లేకపోవడం అభిమానులను బాధిస్తుంది.

Click Here To Watch Now

అయితే ఆయన పుట్టినరోజు నాడే పునీత్ నటించిన చివరి సినిమా ‘జేమ్స్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కు భారీ ఎత్తున సన్నాహాలు జరిగాయి. వారం రోజుల పాటు కర్ణాటకలో ఏ థియేటర్లోనూ వేరే సినిమాను ప్రదర్శించడం లేదు. పుంజీత్ కొన్ని సన్నివేశాలను మినహా పూర్తి సినిమాను పూర్తి చేశారు. ఆ సన్నివేశాలను పక్కన పెట్టి సినిమా విడుదలకు సిద్ధం చేశారు. పునీత్ డబ్బింగ్ చెప్పకపోయినా.. అతడి అన్నయ్య శివరాజ్ కుమార్ వాయిస్ తో మేనేజ్ చేశారు.

ఇలా పునీత్ పుట్టినరోజుకి కష్టపడి సినిమాను రెడీ చేశారు. పునీత్ ను చివరిసారిగా వెండితెరపై చూసుకోవడానికి అభిమానులు భారీగా సన్నాహాలు చేసుకున్నారు. ప్రతి థియేటర్ లో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో ముస్తాబు చేశారు. థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తున్నప్పటికీ.. ప్రతి ఒక్కరిలో ఉద్వేగం కట్టలు తెంచుకుంటోంది. ఈరోజు తెల్లవారుజాముzనుంచే షోలు మొదలయ్యాయి.

పునీత్ ను చివరిసారి తెరపై చూస్తూ అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సినిమా చూడడానికి లోపలి వెళ్తూ.. చూసి బయటకి వస్తూ అభిమానులు ఏడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. పునీత్ మరణం ఇప్పటికీ అభిమానులను బాధిస్తుంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus