Puri Jagannadh: పూరికి ఆఫర్ ఇస్తోన్న కరణ్ జోహార్!

  • June 5, 2021 / 04:01 PM IST

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తోన్న ఈ సినిమాకు కరణ్ జోహార్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరో బాక్సర్ గా కనిపించబోతున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్.. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా తీయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

బండ్ల గణేష్ నిర్మాతగా ఈ సినిమా ఉంటుందని అన్నారు. కానీ పూరికి అలాంటి ఆలోచన లేదని.. ఆయన పాన్ ఇండియా సినిమాలు తీయాలనుకుంటున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి వరుసగా కొన్ని ప్రాజెక్ట్ లు చేయాలనుకుంటున్నారు పూరి. ‘లైగర్’ సినిమా తరువాతే దీనికి సంబంధించిన చర్చలు జరగనున్నాయి. గతంలో బాలీవుడ్ సినిమాలను డైరెక్ట్ చేసిన అనుభవం కూడా పూరికి ఉంది. ‘లైగర్’ సినిమా సమయంలో పూరి వర్కింగ్ స్టైల్..

కరణ్ కి నచ్చడంతో ఆయన కూడా పూరితో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడట. ఇప్పటికే పూరి దగ్గర చాలా కథలు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో కొన్ని మార్పులు చేసి సినిమాలు తీసే అవకాశం ఉంది. ముందుగా లాక్ డౌన్ పూర్తయ్యాక ‘లైగర్’ షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus