బాలయ్యతో ఇంకో సినిమాకి ప్రిపేరవుతున్న పూరీ

  • August 9, 2017 / 01:51 PM IST

దర్శకుడు పూరీ జగన్నాధ్ కు ఓ పట్టాన ఎవరో కానీ నచ్చరు. పొరపాటున నచ్చారంటే మాత్రం వాళ్ళని అస్సల వొదిలిపెట్టడు. ఇప్పుడు పూరీ నందమూరి నటసింహం బాలకృష్ణ మీద మనసుపడ్డాడు. బాలయ్యతో ప్రస్తుతం “పైసా వసూల్” సినిమా తీసిన పూరీ జగన్నాధ్ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రాడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

అయితే.. “పైసా వసూల్” అనుకొన్న విడుదల తేదీ కంటే ఓ మూడు వారాల ముందు అనగా సెప్టెంబర్ 1న విడుదలవుతుండగా.. తన తదుపరి చిత్రం కూడా బాలయ్య హీరోగానే తీయాలనుకొంటున్నాడట పూరీ జగన్నాధ్. “అర్జెంటుగా బాలయ్యతో ఇంకో సినిమా చేయాలనుంది, అంతలా నచ్చేశాడు బాలయ్య” అంటూ సినిమా అవుట్ పుట్ గురించి అడిగినవాళ్లందరికీ చెబుతున్నాడట పూరీ జగన్నాధ్. మరి బాలయ్యాలో పూరీ జగన్నాధ్ కి ఏం నచ్చిందో తెలీదు కానీ, ఇమ్మీడియట్ గా పూరీ దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేస్తాడంటే ఆయన అభిమానులు ఒప్పుకుంటారో లేదో తెలియాలంటే.. “పైసా వసూల్” వరకూ వేచి చూడాల్సిందే!


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus