సిట్ నోటీసులు రాగానే తెగ నవ్వుకున్నాం…
- August 28, 2017 / 06:17 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో ‘డ్రగ్స్ కేస్’ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ కేసులో మన టాలీవుడ్ కి చెందిన హీరో అండ్ డైరెక్టర్స్ కి ‘సిట్’ నుండి నోటీసులు రాగానే మీడియా వారివారి పేర్లు మీద జరిపిన చర్చలు పార్లమెంట్ లో ఎమ్మేల్యేల గురించి కూడా జరిగి ఉండదు. దాని కారణంగా చానల్ టీయార్పీ రేటింగ్స్ ఎంత పెరిగాయో తెలియదు కానీ.. నోటీసులు అందుకొన్న వారి పర్సనల్ లైఫ్స్ మాత్రం బాగా డిస్టర్బ్ అయ్యాయి.
అయితే.. నిజానికి ఈ నోటీసులు అందుకొన్నప్పుడు పూరీ జగన్నాధ్, రవితేజలు ఏమాత్రం టెన్షన్ పడలేదంట. పైపెచ్చు విరగబడి నవ్వుకొన్నారట. ఈ విషయాన్ని స్వయంగా పూరీ జగన్నాధ్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అలాగే తాను బాలకృష్ణతో వర్క్ చేయడం హ్యాపీగా ఫీల్ అవుతున్నానని, త్వరలోనే మరోమారు బాలయ్యబాబుతో వర్క్ చేయనున్నానని తెలియజెప్పాడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















