పూరి… ‘బాహుబలి’ రేంజ్ లో హడావిడి చేస్తున్నాడు..!

  • February 26, 2019 / 03:38 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం రూపొందుతున్నసంగతి తెలిసిందే. ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్ పై పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మీ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే 45 శాతం షూటింగ్ పూర్తయ్యిందట. సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇక ఈ చిత్రం షూటింగు దశలో ఉండగానే…. ‘డబుల్ ఇస్మార్ట్ ‘ టైటిల్ ను ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించాడట పూరి.

వివరాల్లోకి వెళితే.. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందనుందట. ఈ చిత్రానికి చార్మీ పూర్తి నిర్మాణ బాధ్యతలు చేపట్టనుందని సమాచారం. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం హిట్టయితేనే ఈ సీక్వెల్ ఉంటుందట. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం హిట్టవుతుందని… పూరికి అంత నమ్మకమా.. అని సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. అయితే కేవలం ఇది పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ చిత్రం ఏ రేంజ్ లో పూరికి… రామ్ కి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus