ఇటీవల జరిగిన థియేటర్ల ఇష్యు గురించి అందరికీ తెలిసిందే. అది ఎందుకో కూడా అందరికీ తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా వస్తున్నప్పుడు థియేటర్లు బంద్ చేస్తామని వార్తలు రావడాన్ని మంత్రి కందుల దుర్గేష్ వ్యతిరేకించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు పవన్ కళ్యాణ్ కి కూడా కోపం తెప్పించాయి. ఈ క్రమంలో ‘ఆ నలుగురు కుట్ర’ అనే అంశం హైలెట్ అయ్యింది. దీంతో దిల్ రాజు (Dil Raju) , అల్లు అరవింద్ (Allu Aravind) వంటి బడా నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి.. దాంతో మాకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది.
ఆర్ నారాయణ మూర్తి (R Narayana Murthy) మాట్లాడుతూ.. “జూన్ 1 నుండి థియేటర్లు బంద్ అనే వార్తలు రావడం బాధాకరం. ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ టైంలో థియేటర్లు బంద్ చేస్తున్నట్లు వార్తలు రావడం అనేది దుర్మార్గం. కానీ .. ప్రొడ్యూసర్ కౌన్సిల్(ఛాంబర్) కొన్ని నియమాలు పాటిస్తుంది. థియేటర్లను మూసివేయడం అనేది వస్తే.. 3 వారాల ముందు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి, మీడియాకి ఇన్ఫార్మ్ చేయాలి.
ఇదంతా జరగనప్పుడు ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం కుట్ర చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్ గారు స్పందించడం అనేది కరెక్ట్ కాదు. సినీ పరిశ్రమ నుండి సొంతంగా ‘జనసేన’ పార్టీని పెట్టి.. గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. అందుకు మేమంతా గర్విస్తున్నాం. కానీ డిప్యూటీ సీఎం స్థానంలో ఉండి మీ సినిమా ‘హరిహర వీరమల్లు’ ఉన్నప్పుడు థియేటర్ల బంద్ విషయంలో స్పందించిన విధానం కరెక్ట్ కాదు.
అవసరమైతే మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఓ మీటింగ్ ఏర్పాటు చేసి.. సినీ ప్రముఖులను ‘రండి.. మన సమస్యలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పరిష్కరించుకుందాం’ అని చెబితే ఎంత బాగుండేది. కుదిరితే ఆ పని చేయండి సార్. పర్సెంటేజ్ విధానం వల్ల బయ్యర్స్ కి మేలు జరుగుతుంది.. సింగిల్ స్క్రీన్స్ నిలబడతాయి. సినిమా బడ్జెట్ ను బట్టి టికెట్ రేట్లు పెంచడం అనేది కూడా కరెక్ట్ కాదు” అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు.
డిప్యూటీ సీయం స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ థియేటర్ల బంద్ విషయంలో స్పందించిన విధానం కరెక్ట్ కాదు
– ఆర్.నారాయణమూర్తి#RNarayanaMurthy #PawanKalyan pic.twitter.com/j1dGmqTXZw— Filmy Focus (@FilmyFocus) May 31, 2025