బిగ్ బాస్ 2 వల్ల లక్ష్మి రాయ్ కి ఎందుకు కోపం వచ్చింది ?

  • June 11, 2018 / 08:05 AM IST

తన అందంతో తెలుగు, తమిళ ప్రజల్నే కాకుండా బాలీవుడ్ సినీ జనాలను సైతం లక్ష్మి రాయ్ ఆకట్టుకుంది. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే ఐటెం సాంగ్స్ తో మతులు పోగొడుతోంది. సర్ధార్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ తో స్టెప్పులు వేసిన ఈ బ్యూటీ.. మెగాస్టార్ చిరంజీవితోను రత్తాలు రత్తాలు అంటూ పిలిపించుకుంది. ఇలా దక్షిణాదిలో అనేక సినిమాలతో బిజీగా ఉన్న లక్ష్మి రాయ్ కి కోపం వచ్చింది. వివరాల్లోకి వెళితే… తమిళంలో ఈ నెల 17 నుంచి బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం కానుంది. ఇక షో లో ఎవరెవరు పాల్గొంటారో

తెలుసుకోవడానికి తమిళ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. విశ్వనటుడు కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్న ఈ రెండో సీజన్ లో లక్ష్మి రాయ్ పాల్గొంటుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు సినిమాలు లేకపోవడంతోనే లక్ష్మి రాయ్ ఇందులో పాల్గొంటుందని కథనాలు ప్రచురిస్తున్నారు. ఈ వార్తలు ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించాయి. “ఖాళీగా నేను ఉన్నానని, అందుకే బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. నేను ఇదివరకే చెప్పాను.. బిగ్ బాస్ లో నేను పాల్గొనడం లేదని, అయినా ఛానల్ కు చెందిన కొందరు పనికిమాలిన వాళ్లు ఇలా కావాలనే నా పేరుని ప్రచారం చేస్తున్నారు” అని మండిపడింది. ఇక నుంచి అయిన లక్ష్మి రాయ్ పై ఈ వార్తలు ఆగుతాయోమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus