ఎన్టీఆర్ 27 వ సినిమాలో ఒక హీరోయిన్ గా రాశీ ఖన్నా

  • January 20, 2017 / 01:08 PM IST

ఢిల్లీ సుందరి రాశీఖన్నాకి ఈ ఏడాది కలిసి వచ్చేలా ఉంది. ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ జిల్, జోరు, శివమ్ , హైపర్, సుప్రీమ్ చిత్రాలలో నటించింది. బెంగాల్ టైగర్ చిత్రంలో మాస్ మహారాజ రవితేజతో స్టెప్పులేసినా ఆ చిత్రం విజయం సాధించకపోవడం ఆమె కెరీర్ గ్రాఫ్ డౌన్ అయింది. ఈ ఏడాది భారీ సినిమాలలో నటించి టాలీవుడ్ అగ్ర కథానాయికల జాబితాలో చేరిపోనుంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేయనున్న విలేజ్ లవ్ స్టోరీలో అవకాశం కొట్టేసిన రాశీ ఖన్నా, తాజాగా ఎన్టీఆర్ 27 వ సినిమాలో ఓకే హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ వంద కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ లో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ఆ ముగ్గురు పక్కన ముగ్గురు భామలు నటించనున్నారు. అందులో ఒకరిగా ఢిల్లీ భామ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఫిబ్రవరి 11 న పూజా కార్యక్రమాలు జరుపుకోనున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ రెండు చిత్రాలు విజయ వంతమైతే రాశీ ఖన్నా టాప్ హీరోయిన్ కావడం గ్యారంటీ.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus