ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడంపై స్పందించిన రాశీఖన్నా

  • September 4, 2018 / 12:47 PM IST

ఎన్టీఆర్ బయోపిక్ మూవీ తారలతో నిండిపోతోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. మహానటుడు భార్య బసవతారకమ్మ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ నటిస్తోంది. ఏఎన్నార్ గా సుమంత్, కృష్ణ గా సుధీర్ బాబు, చంద్రబాబు నాయుడిగా రానా నటించనున్న ఈ చిత్రంలో నరేష్ నిర్మాత బొగట వెంకట సుబ్బారావు పాత్రలో కనిపించనున్నారు. ఇక ఎన్టీఆర్ అనేక మంది హీరోయిన్స్ తో కలిసి నటించారు. అందుకే శ్రీదేవి పాత్రకోసం రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నారు.

మరో స్టార్ హీరోయిన్ జయప్రద పాత్ర కోసం ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నాను సెలక్ట్ చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. తొలిప్రేమ విజయంతో ఫుల్ ఫామ్లోకి వచ్చిన ఈ బ్యూటీ ఎన్టీఆర్ బయోపిక్ ఉండడం అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని రాశీఖన్నా ఈ రోజు స్పష్టం చేసింది. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “ఇంతవరకు ఈ పాత్ర విషయమై నన్ను ఎవరూ సంప్రదించలేదు. నా నెక్స్ట్ మూవీ విజయ్ దేవరకొండ జోడీగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఉంటుంది. ఈ పాత్ర తనకి మరింత క్రేజ్ ను తీసుకొస్తుంది” అని నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఆమె గత చిత్రం శ్రీనివాస్ కళ్యాణం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus