షూటింగ్ మధ్యలో వెళ్లిపోయిన రాధికా ఆప్టే

  • July 21, 2016 / 11:44 AM IST

సినీ పరిశ్రమలో అడుగు పెట్టి కొంతకాలంలోనే సూపర్ స్టార్ రజనీ కాంత్ తో కలిసి నటించే అవకాశం అందుకున్ననటి రాధికా ఆప్టే. ఆమె నటించిన కబాలి సినిమా రేపు విడుదల కానుంది. రామ్ గోపాల్ వర్మ  రక్త చరిత్ర సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ బాలకృష్ణతో లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తున్న ఈ బాలీవుడ్ సుందరి గురించి ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. ఆమె తమిళ హీరోను షూటింగ్ స్పాట్ లోనే బండ బూతులు తిట్టినట్లు తెలిసింది. ‘రంగం’ సినిమాలో విలన్ గా నటించిన అజ్మల్ హీరోగా ఓ తమిళ చిత్రం తెరకెక్కుతోంది.

ఇందులో రాధికా ఆప్టే హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ సమయంలో అజ్మల్, రాధికా తో శృతి మించి రొమాన్స్ చేసాడట. దీంతో ఆవేశంతో రాధికా ఇంగ్లిష్ లో పచ్చి బూతులు తిట్టి.. అక్కడ నుంచి వెళ్లిపోయిందని చిత్ర బృందం తెలిపింది. ఇక అజ్మల్తో నటించేది లేదని కచ్చితంగా చెప్పేసిందని సమాచారం. ఆ చిత్ర నిర్మాత ఆమెను బుజ్జగించినా ఫలితం లేకుండా పోయేసరికి .. అజ్మల్ తో రాధికా కి ‘సారీ’ చెప్పించే ఆలోచనలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus