ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న దర్శకధీరుడు

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చిత్రం చేయాలనీ ఆయన  అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. జక్కన్న, ప్రిన్స్ లు కూడా కలిసి సినిమా చేయాలని భావిస్తున్నారు. మహేష్ తో సినిమా తెరకెక్కిస్తానని గతంలో రాజమౌళి ప్రముఖ నిర్మాత కె. ఎల్. నారాయణకు మాట ఇచ్చారు. బాహుబలి తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అవుతుందని నిర్మాత అనుకున్నారు. అయితే బాహుబలి రెండు పార్టులుగా అవ్వడం, దానికి నాలుగేళ్లు సమయం పట్టడంతో ఆయన ఏమి చేయలేక పోయారు.

దర్శకధీరుడు మాత్రం బాహుబలికి ముందు ఒప్పందం కుదుర్చుకున్న సినిమాలను బాహుబలి కంక్లూజన్ విడుదలైన తర్వాత కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అందులో ఒకటి కె. ఎల్. నారాయణ ప్రాజక్ట్ కాగా, మరొకటి డీవీవీ దానయ్య సినిమా. మొదటి ప్రాజక్ట్ కి మహేష్ బాబు ఖరారు అయ్యారు. రెండో ప్రాజక్ట్ కి తమిళ నటుడు సూర్య ను ఎంచుకోనున్నట్లు సమాచారం. ఈ రెండు చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే మళ్లీ భారీ ప్రాజక్టుల జోలికి వెలుతారట. సో.. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా గ్యారంటీగా వస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus