రీ సౌండ్ వచ్చేలా ప్లాన్ చేసిన నిర్మాత

  • December 21, 2020 / 06:18 PM IST

మొత్తానికి కొన్ని సినిమాలు లాక్ డౌన్ తరువాత భారీ స్థాయిలో విడుదల కావడానికి సిద్ధమయ్యాయి. దాదాపు 8 నెలలకు పైగా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. ఇక ఆ సైలెన్స్ బద్ధలయ్యేలా రీ సౌండ్ ప్లాన్ చేస్తున్నారు కొందరు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా క్రిస్టమస్ సందర్భంగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను BVSN ప్రసాద్ నిర్మించగా సుబ్బు డైరెక్ట్ చేశాడు.

ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేయడానికి సిద్ధమైంది చిత్ర యూనిట్. అయితే ఆ వేడుకకు దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రత్యేక అతిధిగా రానున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్ తోనే హైప్ క్రియేట్ చేయాలని చిత్ర నిర్మాత భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళి నిర్మాత ప్రసాద్ మంచి మిత్రులు. వీరి కలయికలో ఛత్రపతి సినిమా రూపొందింది. అప్పటి నుంచి రాజమౌళి సినిమాల బిజినెస్ లో కూడా ప్రసాద్ పాత్ర ఉంటూ వస్తోంది.

ఆ స్నేహం కారణంగానే సాయి ధరమ్ తేజ్ సినిమా కోసం మొదటిసారి అతని సినిమా వేడుకలో పాల్గొనబోతున్నాడు జక్కన్న. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus