మహానటి సినిమాపై రాజమౌళి కామెంట్.!

  • May 9, 2018 / 01:14 PM IST

యువ దర్శకుడు నాగ్ అశ్విన్ రెండేళ్లుగా సావిత్రి జీవితంపై పరిశోధించి స్క్రిప్ట్ రెడీ చేసుకొని మహానటి సినిమాను తెరకెక్కించారు. మహానటిగా కీర్తి సురేష్ నటించింది. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మించిన ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. చూసిన ప్రతి ఒక్కరూ అద్భుత సినిమా అని ప్రశంసిస్తున్నారు. సామాన్యులే కాదు సినీ దిగ్గజాలు కూడా అభినందించక ఉండలేకపోతున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి తొలి షో చూసి ట్విట్టర్ వేదికపై స్పందించారు. “నేను ఇంతవరకు చూడనటువంటి అత్యద్భుతమైన నటనను మహానటిలో చూసాను.

సావిత్రి గారిగా కీర్తి సురేష్ నటన అమోఘం. ఆమె సావిత్రిని అనుకరించలేదు.. ఆమెగా లీనమై చేశారు. మహానటిని గుర్తుకు తెచ్చారు. దుల్కర్ సల్మాన్ నటన ఫెంటాస్టిక్. అందుకే ఈ క్షణం నుంచి నేను అతనికి అభిమానిని అయ్యా” అని ప్రశంసల జల్లు కురిపించారు. అంతటితో ఆగకుండా డైరక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్నదత్ ల నమ్మకానికి, పట్టుదల, నిబద్ధతకు, హ్యాట్సాఫ్ చెప్పారు. దర్శకధీరుడి అభినందన మహానటి చిత్ర బృందానికి ఆనందాన్ని కలిగించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus