మహేష్ తో సినిమా చేస్తానని చెప్పిన రాజమౌళి

  • October 14, 2017 / 01:32 PM IST

బాహుబలి తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో సస్పెన్స్ వీడింది. ఆయన చేయనున్న సినిమాలను స్వయంగా వెల్లడించారు. ఓ అంతర్జాతీయ పత్రికకు రాజమౌళి ఇంటర్వ్యూ ఇస్తూ తన తర్వాతి ప్రాజక్టులపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది నిర్మాత డివివి దానయ్య నిర్మాణంలో సినిమా ఉంటుందని చెప్పారు. అయితే హీరో, హీరోయిన్స్ ఎవరనేది చెప్పలేదు. ఆ తర్వాత 2019 లో కెఎల్. నారాయణ నిర్మాణంలో ఓ మూవీ చేస్తున్నట్లు వివరించారు. ఇందులో హీరోగా మహేష్ బాబు నటిస్తారని వెల్లడించారు. ఇది ఒక సామాజిక చిత్రమని కూడా ఇప్పుడే స్పష్టం చేశారు. దీంతో మహేష్ అభిమానులు ఆనందపడుతున్నారు.

ఎప్పటి నుంచో వీరి కాంబినేషన్లో సినిమా రావాలని కోరుకుంటున్నారు. ఆ కల మరో రెండేళ్లలో తీరనుంది. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా చేస్తున్నారు. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ రెండూ పూర్తి అయిన తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus