సోషల్‌ మీడియా ఎక్కి రచ్చ చేస్తున్న దర్శకుడు, రచయిత… ఎవరంటే?

  • January 12, 2024 / 01:53 PM IST

యువ దర్శకుడు రాజసింహా తాడినాడ గుర్తున్నారా? అలాగే సీనియర్‌ దర్శకుడు వీఎన్‌ ఆదిత్య మీకు గుర్తున్నారుగా? వాళ్లిద్దరి మధ్య సోషల్‌ మీడియాలో ఇటీవల పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనేది ఇప్పుడు చెప్పాలంటే చెప్పొచ్చు కానీ… రుజువులు లేకుండా ఆ పోస్టులు డిలీట్‌ చేసేశారు. అయితే కొంతమంది మాత్రం వాటిని స్క్రీన్‌ షాట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

దర్శకుడు రాజసింహ తాడినాడ అంటే పెద్దగా గుర్తుకురాకపోవచ్చు. అయితే రైటర్‌ రాజసింహ అంటే ఈజీగా గుర్తొస్తుంది. తెలుగులో ఎన్నో హిట్‌ సినిమాలకు ఆయన రచయిత. బాగా గుర్తుండిపోయే సినిమా అని కాదు కానీ పాత్ర చెప్పాలంటే ‘గోన గన్నారెడ్డి’ పాత్ర అని చెప్పాలి. ‘రుద్రమదేవి’ సినిమాలో బన్నీ పాత్రకు మాటలు రాసింది ఆయనే. ఆ తర్వాత సందీప్‌ కిషన్‌ – నిత్య మీనన్‌తో ‘ఒక్క అమ్మాయి తప్ప’ అనే సినిమా చేశారు.

ఇక వీఎన్‌ ఆదిత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్‌ సినిమాలు ఇచ్చి సరైన ఛాన్స్‌లు రాక కామ్‌గా ఉన్నారు. అయితే ప్రముఖ నిర్మాత వివేక్‌ కూచిబొట్లపై రాజసింహ ఇటీవల కొన్ని అభ్యంతరకర కామెంట్స్‌ చేశారు. వాటిని ఆయన ఖండించలేదు కానీ.. ఆదిత్య ఖండించారు. అంతేకాదు రాజసింహ కోసం వివేక్‌ చేసిన సాయం గురించి మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడు అని రాజసింహను హెచ్చరించారు.

అయితే దానికి ప్రతిగా రాజసింహ ఆదిత్యను దుర్భాషలాడుతూ సింగర్‌ సునీత టాపిక్‌ను మధ్యలోకి లాగారు. గతంలో ఓసారి రాజసింహ ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. ఆ విషయాన్ని నెటిజన్లు ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడుతున్నారు. దీంతో అసలు ఏమైంది అనేది తేలకుండా అనవసరంగా రచ్చ జరుగుతోంది. వివేక్‌ గతంలో రాజసింహకు సాయం చేశారు అనేది ఇండస్ట్రీ మాట. మరి అంత సాయం చేసిన ఆయన్ను ఇప్పుడు (Rajasimha) రాజసింహ ఎందుకు అన్నట్లు, దానికి ఆదిత్య ఎందుకు స్పందించినట్లు అనేది ఇక్కడ డౌట్‌.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus