Rajinikanth: తలైవా అభిమానుల్లో ఆందోళన

  • June 15, 2021 / 10:30 AM IST

అనారోగ్యం నుండి కోలుకొని ఇటీవల సినిమా చిత్రీకరణలు ప్రారంభించారు రజనీకాంత్‌. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ రావడంతో సినిమా చిత్రీకరణ వాయిదా వేశారు. అయితే ఇప్పుడు మరోసారి సినిమా చిత్రీకరణలు ప్రారంభమవుతున్న సమయంలో రజనీకాంత్‌ యూఎస్‌ వెళ్లబోతున్నారు. దీంతో రజనీ ఎందుకు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారా అని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆరోగ్యం విషయంలో రజనీకాంత్‌ గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పి… ఆ తర్వాత ఈ కారణంగానే ఆగిపోయారనే విషయమూ తెలిసిందే.

ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘అన్నాతే’ సెట్‌లో కూడా నిత్యం వైద్యులు ఉండేవారని సమాచారం. ఇప్పుడు ఇదే కారణంతోనే ఆయన యూఎస్‌ ట్రిప్‌కి వెళ్తున్నారని తెలుస్తోంది. రజనీకి అక్కడ పూర్తిస్థాయి హెల్త్‌ చెకప్‌ చేస్తారని భోగట్టా.రజనీకాంత్‌కు ఇటీవల ఏటా ఇలాంటి చెకప్ నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు సాధారణంగా యూఎస్‌ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కేంద్రం నుండి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. తన కుటుంబంతో సహా ప్రత్యేక చార్టెర్డ్‌ ఫ్లైట్‌లో అమెరికా వెళ్లబోతున్నారు రజనీ.

ఆ విమానంలో 14 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఓ హాలీవుడ్ సినిమా షూటింగ్ నిమిత్తం ధనుష్ అమెరికాలోనే ఉన్న విషయం తెలిసిందే. మామూలుగా బాడీ చెకప్‌కు మొత్తం కుటుంబం వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ రజనీ ఎందుకు వెళ్తున్నారు, ఏదైనా సర్జరీ జరిగే అవకాశం ఉందా? అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే కరోనా కారణంగా చాలా రోజులుగా కుటుంబ సభ్యులు అంతా ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారు కూడా బయటకు వెళ్లేలా అవుతుందనే రజనీ ఈ ఫ్యామిలీ ట్రిప్‌ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఏదైతేముంది… తలైవా హ్యాపీగా ట్రిప్‌ వేసి వచ్చేయాలి. వెంటనే సినిమాలు స్టార్ట్‌ చేసేయాలి. ఇదే మనకు కావాలి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus