‘దర్బార్’ చిత్ర యూనిట్ పై స్టూడెంట్స్ రాళ్ళ దాడి

  • May 2, 2019 / 05:09 PM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్లో ‘దర్బార్’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమద్యే ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యింది. షూటింగ్ మొదలుపెట్టిన రోజే ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. అయినప్పటికీ ఈ చిత్రం షూటింగ్ లోని కొన్ని పిక్స్ ఇటీవల లీకవ్వడంతో డైరెక్టర్ మురుగదాస్ షాకయ్యాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నయనతార ఫోటోలు కూడా లీకయ్యాయి. ఈ క్రమంలో మురుగదాస్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

ఇందులో భాగంగా షూటింగ్ స్పాట్ వద్ద ఎవరూ మొబైల్ ఫోన్స్ వాడకూడదని నిబంధనలు పెట్టాడట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబైలోని ఓ కాలేజ్ లో జరుగుతుంది. రజినీకాంత్ ని, షూటింగ్ ని చూడడానికి స్టూడెంట్లు తెగ ఎగబడుతున్నారట. అంతేకాదు మొబైల్ లో ఫోటోలు, వీడియోలు కూడా షూట్ చేస్తున్నారట. ఈ క్రమంలో చిత్రయూనిట్ వారి పై కాస్త కఠినంగా ప్రవర్తించిందట. వెంటనే అక్కడి నుండీ వెళ్ళిపొమ్మని హెచ్చరించడంతో స్టూడెంట్స్ హర్ట్ అయ్యి వారి పై రాళ్ళతో దాడిచేశారట. దీంతో మురుగదాస్ స్వయంగా కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడారట. షూటింగ్ వైపు విద్యార్ధులను రానివ్వకండి, మీరు అలా చెప్పకపోతే మరో ప్రత్యామ్నాయం చూసుకుంటామని మురుగదాస్ కాలేజీ యాజమాన్యంతో చెప్పాడట. తొందరగా షూటింగ్ పూర్తిచేసి సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus