యంగ్ డైరక్టర్ తో సినిమాకు ఒకే చెప్పిన రజినీ కాంత్

  • February 23, 2018 / 01:04 PM IST

‘నా అనుభవం అంత లేదు నీ వయసు’ … పెద్దలకు మనం ఏదైనా సలహా ఇచ్చినప్పుడు చాలామంది వాడే రొటీన్ డైలాగ్ ఇది. కానీ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ మాత్రం.. తన వద్దకు కథ చెప్పడానికి వచ్చిన యువకుడికి ఈ డైలాగ్ చెప్పలేదు. పైగా కథని పూర్తిగా విని, అతని ప్రతిభని మెచ్చుకొని సినిమా చేయడానికి ఒకే చెప్పారు. ఆ యువకుడు ఎవరో కాదు కార్తిక్ సుబ్బరాజ్. “పిజ్జా” సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్ సినీ పెద్దల దృష్టిని ఆకర్షించిన ఈ డైరక్టర్… ఆ తర్వాత “జిగర్తాండ, ఇరైవి” వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు రజినీని ఒప్పించారు. ప్రస్తుతం రజినీ కాంత్ శంకర్ దర్శకత్వంలో 2 .౦ చేస్తున్నారు.

ఇందుకు గ్రాఫిక్స్ వర్క్స్ జరుగుతోంది. అలాగే పా రంజిత్ దర్శకత్వంలో కాలా సినిమాని పూర్తి చేశారు. ఈ చిత్రానికి డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశారు. ధనుష్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 27 న రిలీజ్ కానుంది. అంతకంటే ముందుగానే కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించడానికి రజినీ రెడీ అవుతున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే నెలల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. రజినీ కాంత్ ఎన్నికల్లో పోటీ చేయనున్న సందర్భంగా.. వేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus