రాజమౌళి దృష్టిలో ఆ ఇద్దరి బాలీవుడ్ భామలు?

  • April 9, 2019 / 05:41 PM IST

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో డీ.వి.వి.దానయ్య నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఎన్టీఆర్ .. చరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రంలో మంచి స్టార్ క్యాస్టింగ్ ను ఎంచుకున్నాడు జక్కన్న. ఇందులో భాగంగా చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ ను ఎంచుకోగా…ఎన్టీఆర్ సరసన ‘డైసీ ఎడ్గర్ జోన్స్’ను ఎంపిక చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుండీ డైసీ తప్పుకుంది. దీంతో ఇప్పుడు డైసీ స్థానంలో ఎవర్ని తీసుకోనున్నారనేది చర్చనీయాంశం అయ్యింది.

ఇప్పటికే రాజమౌళి ఇద్దర్ని అనుకున్నాడట. ఇందులో మొదటి ఆప్షన్ శ్రద్ధా కపూర్ .. రెండో ఆప్షన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ప్రభాస్ ‘సాహో’లో శ్రద్ధా కపూర్ పార్ట్ దాదాపు పూర్తయిందని…. దీంతో ఆమెను ‘ఆర్.ఆర్.ఆర్’ కి తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు మొదలుపెట్టాడట. ఒకవేళ శ్రద్ధా కపూర్ నో అంటే.. అతిలోకసుందరి జాన్వీ కపూర్ ను తీసుకోవాలనే ఉద్దేశంతో రాజమౌళి ఉన్నాడట. ఏదేమైనా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కోసం జక్కన్నకి తిప్పలు తప్పట్లేదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus