‘శ్రీదేవి బయోపిక్’ లో యాక్ట్ చేయాలని ఆశగా ఉంది : రకుల్

  • January 28, 2019 / 10:51 AM IST

మహేష్ బాబుతో ‘స్పైడర్’, రాంచరణ్ తో ‘బ్రూస్ లీ’ ‘ధృవ’, జూ.ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’, అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ వంటి పెద్ద సినిమాలలో నటించినప్పటికీ రకుల్ ప్రీత్ సింగ్ కు పెద్ద ఆఫర్లు మాత్రం రాలేదనే చెప్పాలి. ఈ కోలీవుడ్, బాలీవుడ్ లో నటిస్తూ బిజీగా ఉంది రకుల్. ఇటీవల సంక్రాంతి కానుకగా వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో చిన్న క్యామియో పాత్రలో కనిపించింది రకుల్. కనిపించింది కాసేపే అయినా శ్రీదేవి పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇక దీంతో ఫుల్ లెంగ్త్ ‘శ్రీదేవి లో’ (శ్రీదేవి బయోపిక్) లో నటించాలని ఆశపడుతోందట.

తాజాగా సావిత్రి బయోపిక్ అయిన ‘మహానటి’ గురించి రకుల్ మాట్లాడుతూ.. ‘ఆ చిత్రం తనమీద ఎంతో ప్రభావం చూపించిందని.. తనకు శ్రీదేవి బయోపిక్ లో నటించాలనే ఆలోచన కలిగిందని చెప్పింది. ‘శ్రీదేవి బయోపిక్’ లో నటించాలనే తన కోరికను ఈ విధంగా వ్యక్తపరిచిందన మాట. అయితే ఇంకా బోనీ కపూర్ శ్రీదేవి బయోపిక్ పై ఇంకా ఎలాంటి ఇవ్వలేదు. అయితే ముందు జాగ్రత్తగా టైటిల్ ని మాత్రం రిజిస్టర్ చేసి పెట్టినట్టు ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. మరి ఒకవేళ శ్రీదేవి బయోపిక్ ని ప్లాన్ చేసినప్పటికీ.. ఆ పాత్రకోసం రకుల్ ప్రీత్ సింగ్ పేరుని పరీశీలిస్తాడా.. అనేది పెద్ద ప్రశ్నే..! ఇక రకుల్ ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన ‘ఎన్.జీ.వో’, అలాగే కార్తి ‘దేవ్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంది. వీటితో పాటు బాలీవుడ్ లో కూడా రెండు చిత్రాల్లో నటిస్తుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus