రకుల్ పారితోషకం రూ.2 కోట్లా..?

  • April 26, 2016 / 09:04 AM IST

హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా అగ్ర హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తూ దూసుకుపోతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవలే విడుదలైన సరైనోడు చిత్రంలో తన నటనకు మంచి మార్కులు వేయించుకున్న రకుల్.. తాజాగా మరోసారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటించనుంది.

ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ జంటగా నటిస్తుండగా.. ఈ చిత్రం కోసం రకుల్ అక్షరాల రెండు కోట్ల రూపాయలను పారితోషకంగా తీసుకుంటోందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరోవైపు మస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న తుప్పరివాలన్ చిత్రం కోసం రకుల్ దాదాపు రూ.కోటి రూపాయలను పారితోషంగా తీసుకుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ విధంగా సరైన హిట్లు లేకపోయినా కూడా కోట్లకు కోట్లు కొల్లగొడుతూ.. అగ్ర కథానాయికగా అలరారుతున్న రకుల్ ను చూసి ఆమె తోటి కథానాయికలందరూ కుళ్లుకొంటున్నారు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus