నందమూరి ఫ్యాన్స్ కి చెర్రీ షాక్..!

  • September 30, 2017 / 08:56 AM IST

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి చరిష్మాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో తన నటనతో, డ్యాన్స్ తో దూసుకెళ్తున్నాడు చెర్రీ…ఈ మధ్య వరుస ఫ్లాప్స్ తో కాస్త వెనుకబడిపోయినప్పటికీ, ధృవతో మళ్లీ మంచి హిట్ ను అందుకున్నాడు చెర్రీ…అయితే చెర్రీ ఎన్టీఆర్ తో ఒక ఫోటో దిగి సోషియల్ మీడియాలో అందరితో షేర్ చేసుకున్నాడు…ఇక ఈ ఫోటో చూడగానే నందమూరి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు…ఇంతకీ ఆ ఫోటో కధ ఏంటి అంటే…చరణ్ ‘జై లవ కుశ’ సినిమాను చూసి జూనియర్ ని అభినందిస్తూనే…ఎన్టీఆర్‌ కలసి ఒక సెల్ఫీ ఫోటోను కూడ తీసుకుని తమ అభిమానులకు షేర్ చేసాడు. ఇక అక్కడ మొదలయింది అసలు కధ…ఎందుకంటే…సహజంగా అందరూ చిరంజీవి బాలకృష్ణలు కలిసి నటిస్తే చూడాలని అనుకున్నారు…అది ఎప్పుడూ నెరవేరని కలగానే మిగిలిపోయింది. అదే క్రమంలో పొలిటికల్ ఎంట్రీ పుణ్యమా అంటూ…వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కూడ అంతంత మాత్రమే అవ్వడంతో చిరంజీవి బాలకృష్ణలు కలిసి కెమెరాలకు పోజులు ఇచ్చిన సందర్భాలు చాల తక్కువ.

అయితే ఆలోటును చరణ్ తీర్చాడు ఎన్టీఆర్ తో సెల్ఫి దిగి… టాప్ హీరోలు అంతా ఒక్కటే అన్న సందేశాన్ని అందరికీ ఇస్తూ దసరా రోజున మెగా నందమూరి అభిమానులకు ఒక షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారడంతో ఈ ఫోటోను మెగా నందమూరి అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తూ చూడటమే కాకుండా విపరీతంగా లైకులు కొడుతున్నారు. అదే క్రమంలో టాప్ హీరోల రికార్డ్ ల గురించి నానా రభసా చేస్తూ అభిమానులు గందరగోళం సృష్టిస్తున్న ప్రస్తుత పరిస్థుతులలో తాము అంతా ఒకటే అన్న సంకేతాన్ని తమ అభిమానులకు ఇస్తూ చరణ్ వేసిన ఈ ముందడుగు చాల మంచి పరిణామం అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. మొత్తంగా చెర్రీ చేసిన ఈ పనికి అందరూ అభిననదించాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus