చెర్రీకి అక్కడ భారీ డిమాండ్!!!

  • August 2, 2016 / 07:10 AM IST

టాలీవుడ్ మెగాస్టార్ తనయుడిగా, మెగా పవర్ స్టార్ అంటూ టాలీవుడ్ కి దూసుకు వచ్చిన రామ్‌చరణ్ తొలి రోజుల్లో తండ్రి చరిష్మాతో వరుస హిట్స్ సాధించాడు. అయితే క్రమక్రమంగా తాను ఎంచుకున్న కధలు రొటీన్ గా ఉండడం, ఇక సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో టాప్ హీరోగా కొనసాగిన చెర్రీ, లాస్ట్ లిస్ట్ లో లాస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయాడు. అయితే ఆ కోపాన్ని, ఆకసిని అంతా కలగలుపుకుని మళ్లీ బాక్స్ ఆఫీస్ వద్దకు తన పంజా విసరడానికి సిద్దం అవుతున్నాడు మన మెగాపొవెర్ స్టార్.

విషయంలోకి వెళితే…మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ధృవ చిత్రం పై అటు అభిమానుల్లోనే కాదు, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా  భారీ అంచనాలు ఉన్నాయి. తమిళంలో ఘన విజయం సాధించిన తని ఒరువన్ రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో.. రామ్ చరణ్ కొత్త లుక్‌తో కనిపించనున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్‌ప్రీత్ సింగ్ రెండో సారి హీరోయిన్‌గా నటిస్తుంది. చెర్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో డైనమైట్ లాగా రానున్నాడు… ఇదిలా ఉంటే.. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్న తరుణంలో.

ఈ చిత్రం ఒవెర్సీస్ రైట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ మధ్య కాలంలో చరణ్‌కు సరైన హిట్స్ లేకపోయినా, ఈ సినిమా ఓవెర్సీస్ రైట్స్ భారీ ధర పలికాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం…క్లాసిక్ సినిమాస్ వారు ధృవ చిత్ర ఓవర్సీస్ హక్కులను రూ.5 కోట్లకు దక్కించుకున్నారు అని తెలుస్తుంది. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus