నిర్మాతగాను కొనసాగనున్న రామ్ చరణ్ తేజ్

  • November 22, 2016 / 12:20 PM IST

చిత్ర పరిశ్రమలో  ప్రతి క్రాఫ్ట్ లోను పోటీ గట్టిగా ఉంటుంది. ఆ పోటీని తట్టుకుంటూనే ప్రతిభకు సాన పెట్టాలి. విజయాన్ని సొంతం చేసుకోవాలి. ఇలా ఒక విభాగంలో రాణించడమే కష్టం. అటువంటిది రెండు పడవలై ప్రయాణాన్ని సాగించడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సిద్ధమయ్యారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే, మరో వైపు సినిమాలను నిర్మించాలని భావిస్తున్నారు. తొలిసారిగా అతను నిర్మిస్తున్న మూవీ ఖైదీ నంబర్ 150  సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాను చెర్రీ భారీ బడ్జట్ తో తెరకెక్కిస్తున్నారు.

నిర్మాతగా తన తొలి అడుగు విజయం ఇస్తుందని నమ్మకం కలగడంతో, ఇక తాను నిర్మాణరంగంలోను సత్తా చూపించాలని డిసైడ్ అయ్యారు. వచ్చే రెండేళ్లలో పది సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. అఖిల్, శర్వానంద్ వంటి టాలీవుడ్ యువ హీరోలతో చిత్రాలను తీసేందుకు కథలను వింటున్నారు. హీరోగా రెండో చిత్రంతోనే నిరూపించుకున్న రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా ఎంత మేర విజయం అందుకుంటాడో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus