‘చెర్రీ’ మాస్టర్ ప్లాన్ అదిరింది

  • April 25, 2016 / 06:32 AM IST

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్….ఈ కుర్ర హీరో తాజాగా వరుస పరాజయాలతో కాస్త ఇబ్బందుల్లో ఉన్నాడు. కృష్ణవంశీ తెరకెక్కించిన ‘గోవిందుడు అందరివాడేలే’, శ్రీను వైట్ల తెరకెక్కించిన బ్రూస్ లీ…రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మనగా, తాజాగా చెర్రీ తమిళ సినిమా తని ఒరువన్ ను రీమేక్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు హీరోలు ఇష్టపడుతున్నప్పటికీ, అవి బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త ఇబ్బందికర ఫలితాలను ఇస్తున్నాయి. దానికి ఉదాహరణ సర్ధార్ గబ్బర్ సింగ్, సరైనోడు వంటి చిత్రాలు బాక్సాపీస్ వద్ద మిక్స్డ్ రిజల్ట్ ని ఇవ్వడమే. అందుకే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రామ్ చరణ్ తన తరువాత చిత్రానికి సంబంధించిన సెలక్షన్స్ లోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని టాక్…

ఇక  తని ఒరువన్ తరువాత చెర్రీ చెయ్యబోయే సినిమా ఇదే అన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది…వివరాల్లోకి వెళితే….చరణ్ హీరోగా, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘రచ్చ’ బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ఇక ఆ చనువుతోనే సంపత్ చెర్రీ కోసం సరికొత్త కధను తయారు చేసినట్లు సమాచారం. తని ఒరువన్ తరువాత రామ్ చరణ్ కి ఈ కథని వినిపించటానికి సంపత్ రెడీగా ఉన్నాడు. ఇటీవల చరణ్ ను కలిసి ఒక లైన్ కూడా వినిపించాడు. చరణ్ సైతం ఆ లైన్ ని డెవలెప్ చేయాలని, త్వరలోనే మూవీని చేద్దాం అని సంపత్ కి భరోసా ఇచ్చాడంట. ఇక ఆ కధ ఆధ్యంతం కమర్షియల్ ఫార్మ్యాట్ లో ఉండడంతో చెర్రీ వెంటనే ఒకే చెప్పాడని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయోగాలకు పోకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథలనే చేయాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మరి రీమేక్ చెర్రీకి ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags