సుకుమార్ ని డైరక్ట్ చేస్తున్న రామ్ చరణ్ తేజ్

  • November 23, 2016 / 10:37 AM IST

ఇంటెలిజెంట్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వం లో నటించాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఆ కల ధృవ చిత్రం తర్వాత నెరవేర బోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ప్రాజక్ట్ పట్టాలెక్కేలా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం చెర్రీనే అని ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే… మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. అందుకు స్క్రిప్ట్ వర్క్ ని కూడా డైరక్టర్ పూర్తి చేశారు. ధృవ షూటింగ్ ఆలస్యం కాకుంటే ఈ నెలలోనే షూటింగ్ మొదలయ్యేది. కానీ చెర్రీ తాజా చిత్రం పూర్తి అయినా విడుదల పోస్ట్ పోన్ అవుతుండడంతో తర్వాతి చిత్రం మొదలవ్వడానికి వాయిదా పడుతోంది.

జనవరి నుంచి షూటింగ్ ప్రారంభిద్దామని సుకుమార్ టెక్నీషియన్లు, ఆర్టిస్టుల సెలక్షన్లలో బిజీగా ఉంటే దానికి రామ్ చరణ్ అంతరాయం కలిగిస్తున్నట్లు తెలిసింది. తనకి అనుకూలమైన వారిని తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సుకుమార్ ఫ్రెండ్స్. అతనిని కాకుండా ఈసారి కొత్త కెమెరా మెన్ ని ఎంచుకోవాలని అనుకుంటే .. రత్నవేలుని తీసుకోవాలని, చరణ్ బాబు చెప్పారని సిఫార్సులు వస్తున్నాయట. ఆర్ట్ డైరక్టర్ విషయంలోనూ ఇలాగే జరిగిందట. నాన్నకు ప్రేమతో చేసిన ఆర్ట్ డైరక్టర్ రవీందర్ ను తీసుకోవాలని సుకుమార్ భావించారు. ఇందులోనూ చరణ్ వేలు పెట్టారు. తోట తరణిని తీసుకోవాలని చెప్పడంతో సుకుమార్ కి ఏమి చేయాలో తెలియక మౌనం వహించారు. ఇదే విధంగా హీరోయిన్ విషయంలో జరిగిందంట. ఇవన్నీ దగ్గరుండి చూస్తున్న వారు మాత్రం వీరి కలయికలో చిత్రం వచ్చినట్లే అని పెదవి విరుస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus