Ram Charan: చరణ్ కూతురికి బంగారు ఊయల వార్తల్లో నిజమిదే.. ఏమైందంటే?

  • July 1, 2023 / 08:11 AM IST

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రియల్ వార్తల కంటే ఫేక్ వార్తలు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. కొంతమంది సెలబ్రిటీలు ఈ వార్తల గురించి స్పందించి క్లారిటీ ఇస్తుండగా మరి కొందరు మాత్రం ఈ వార్తల గురించి స్పందించడం లేదు. అయితే ఈరోజు చరణ్ ఉపాసన కూతురు బారశాల గ్రాండ్ గా జరుగుతోందనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారని సమాచారం. చిరంజీవి నివాసంలో ఈ వేడుక జరుగుతుండగా చరణ్ ఉపాసన కూతురు కోసం ముఖేశ్ అంబానీ బంగారు ఊయల గిఫ్ట్ గా ఇచ్చారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. అయితే వైరల్ అవుతున్న వార్తలపై చరణ్ టీం స్పందిస్తూ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు. వైరల్ అవుతున్న వార్తలు ఫేక్ అని వాళ్లు తెలిపారు. చరణ్ ఉపాసన కూతురి బారసాల కోసం ప్రజ్వల ఫౌండేషన్ ఇచ్చిన చెక్క ఊయలను వినియోగిస్తున్నారని సమాచారం. చరణ్ ఉపాసన కూతురు చాలా క్యూట్ గా ఉందని ఆ చిన్నారిని చూసిన వాళ్లు చెబుతున్నారు.

చరణ్ టీం క్లారిటీ ఇవ్వడంతో ఇకైనా ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ మూవీ వచ్చే ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుందని వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ మూవీ అంతకంతకూ ఆలస్యం అవుతుండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

చరణ్ (Ram Charan) బుచ్చిబాబు కాంబో మూవీ ఈ ఏడాదే మొదలుకానుందని సమాచారం అందుతోంది. చరణ్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు చేయనున్నారని భోగట్టా. రామ్ చరణ్ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus