Ram Charan: మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న చరణ్.. ఏమైందంటే?

  • April 11, 2024 / 07:22 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) గ్లోబల్ స్టార్ గా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు తన నటనతో అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కానుందని తెలుస్తోంది. వినాయక చవితి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు (Dil Raju) భావించినా ఆ తేదీకి ఈ సినిమాను రిలీజ్ చేయడం కష్టమని తెలుస్తోంది.

అయితే చరణ్ తాజాగా మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. చెన్నై వేల్స్ యూనివర్సిటీ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి అరుదైన గౌరవాన్ని అందించింది. రామ్ చరణ్ కళా రంగానికి అందిస్తున్న సేవలకు ఈ డాక్టరేట్ ను అందిస్తున్నారని తెలుస్తోంది. కొంతకాలం క్రితం వేల్స్ యూనివర్సిటీ పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan) కూడా డాక్టరేట్ ప్రకటించగా పవన్ ఆ డాక్టరేట్ ను సున్నితంగా తిరస్కరించారు.

అప్పుడు పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు రామ్ చరణ్ కు ఈ అరుదైన గౌరవం దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 13వ తేదీన చరణ్ కు డాక్టరేట్ అందించే కార్యక్రమం జరగనుందని సమాచారం అందుతోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబో మూవీ షూట్ త్వరలోనే మొదలుకానుందని తెలుస్తోంది. ఈ సినిమా చరణ్ మాస్ ఫ్యాన్స్ ను మెప్పించేలా ఉండనుందని భోగట్టా.

రామ్ చరణ్ తర్వాత సినిమాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్ 80 నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. చరణ్ సుకుమార్ (Sukumar) కాంబోలో సైతం ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. రెండేళ్లకు ఒక సినిమాలో నటిస్తున్న చరణ్ సినిమాలకు సంబంధించి మరింత వేగం పెంచాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus