శ్రీదేవి కుమార్తె నటన చూడాలని ఆశపడుతున్న రామ్ చరణ్ తేజ్

  • July 4, 2018 / 09:59 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఇక కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాతగా సైరా నరసింహారెడ్డి సినిమా నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో హీరోగా చేస్తున్న సంక్రాంతికి వస్తుండగా.. నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా మార్చిలో రిలీజ్ కానుంది. అయితే ఈ రెండు సినిమాలకంటే ముందు అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించిన దఢక్ మూవీ కోసం చరణ్ వెయిట్ చేస్తున్నారు. అందులో జాన్వీ నటన ఎలా ఉంటుందో చూడాలని రామ్ చరణ్ ఆశపడుతున్నారు. ఇది ఒక సినిమా అభిమానిగా కాకుండా, హీరోగా, నిర్మాతగానూ జాన్విని జడ్జ్ చేయనున్నారు.

గతంలో శ్రీదేవి, చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే శ్రీదేవి కూతురు జాన్వీ ని చెర్రీ సరసన నటింపచేయించాలని అప్పట్లో ప్రయత్నాలు జరిగాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి సీక్వెల్ చేయాలనీ నిర్మాత అశ్వినీదత్ శ్రేదేవిని అడిగి చూసారు. కానీ తన కూతురు స్టడీ పూర్తి చేయాలనీ శ్రీదేవి చెప్పడంతో ఆ ప్రాజక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు దఢక్ తో ఎంట్రీ ఇస్తోంది ఈ మూవీ ఈనెల 20 న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంతో ప్రేక్షకుల మనసుదోచుకుంటే జూనియర్ అతిలోకసుందరిగా జాన్వీ సెలక్ట్ అయిపోయినట్లే. జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ మూవీ పనులు మొదలవడం ఖాయమని ఫిలింనగర్ వాసులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus