రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో హైలెట్ ఏంటో తెలుసా ?

  • June 19, 2017 / 01:43 PM IST

ధృవ వంటి సూపర్ హిట్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ‘రంగస్థలం 1985’. క్యూట్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. సుకుమార్ డైరక్షన్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. నేటి స్మార్ట్ ఫోన్ల కాలానికి దూరంగా 80 ల కాలంలో పల్లెటూరి నేపథ్యంలో సాగే  రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోంది. దీని కోసం చరణ్ పూర్తిగా తన లుక్ మార్చి పక్కా పల్లెటూరి యువకుడిగా కనిపిస్తున్నాడు. గడ్డం పెంచి లుంగీ కట్టాడు.  అంతేగాక సుకుమార్ 1980 ల రోజుల్లో ఉండే వాతావరణాన్నే సినిమా కోసం సృష్టించారు.

అందుకోసం ఆర్ట్ డైరెక్టర్ రామ కృష్ణ సారథ్యంలో భారీ వ్యయంతో సెట్టింగ్స్ వేయిస్తున్నారు. ఈ సెట్స్ చూస్తే స్క్రీన్ మీద పాత కాలపు రోజుల్లోని పల్లెటూరి వాతావరణం కనిపిస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇదే సినిమాలో హైలెట్ కానుందని ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న నటుడు ఆది పినిశెట్టి  చెప్పారు. అనసూయ, జగపతిబాబు తదితరులు నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus