కొరటాల కి 2 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిన చరణ్..!

  • February 5, 2019 / 12:33 PM IST

‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రం పూర్తవ్వగానే… కొరటాల శివ డైరెక్షన్లో ఓ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్’ మరియు ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ల పై ఈ చిత్రం నిర్మితమవ్వబోతుంది. మెగాస్టార్ 152 వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రైతు పాత్రలో కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చక చకా జరుగుతున్నాయని తెలుస్తుంది. మర్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారం నుండీ ఈ చిత్ర షూటింగ్ మొదలుకాబోతుందని టాక్ వినిపిస్తుంది.

ఇప్పటికే నాలుగు బ్లాక్ బస్టర్లు అందుకుని… స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన కొరటాల శివ ఒక్కో సినిమాకి 10 నుంచి 15 కోట్లు పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారని గత కొంత కాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే చిత్రం కోసం.. ఇప్పటికే కొరటాల కి 2 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చాడట చరణ్. మిగిలిన పారితోషికాన్ని… ఉత్తరాంధ్ర ప్రాంతంలోని షేర్ ని తన వాటాగా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. కొరటాల కోరిక మేరకే ఇలా ఫిక్స్ చేయడం జరిగిందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తే కొరటాలకి భారీ మొత్తమే అందుతుందన్న మాట. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ కోసం ముందుగా నయనతార .. అనుష్క లను అనుకుంటుండగా… ఇప్పుడు తమన్నా పేరుని కూడా పరిశీలిస్తున్నాడట కొరటాల.

ఇటీవల ‘ఎఫ్2’ చిత్రంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సరసన నటించింది తమన్నా. దీంతో కొరటాల.. తమన్నా పేరుని చరణ్ దృష్టికి తీసుకెళ్ళాడట. దీని పై చరణ్ కూడా పాజిటివ్ గానే స్పందించినట్టు తెలుస్తుంది. గతంలో ‘రచ్చ’ ఆడియో వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించాలని ఉందని తమన్నా చెప్పింది. దానికి చరణ్ కూడా ఆ చిత్రాన్ని నేనే నిర్మిస్తానని చెప్పాడు. ఇప్పుడు అది నిజమవ్వబోతున్నట్టే కనిపిస్తుంది. అందులోనూ ‘సైరా’ లో కూడా తమన్నా ఓ కీలక పాత్ర చేస్తుంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి. మరోపక్క ఈ చిత్రాన్ని కొరటాల 6 నెలల్లో పూర్తి చేసేయాలనే ప్లాన్ లో ఉన్నాడట. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2020 సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus