Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Advertisement

బాలీవుడ్ విజువల్ వండర్ ‘బ్రహ్మాస్త్ర’ సీక్వెల్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ బయటికొచ్చింది. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తప్పుకోగా.. ఆ బాధ్యతలను నమిత్ మల్హోత్రా పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారట. ఇండియన్ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా ‘రామాయణ’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా.. 2026, 2027 దీపావళికి థియేటర్లలోకి రానుంది. అయితే, తాజాగా జరిగిన సినిమా కాన్ 2026 ఈవెంట్‌లో రామాయణ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నమిత్.. త్వరలోనే తాను ‘బ్రహ్మాస్త్ర 2’ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా రివీల్ చేశారు.

Brahmastra 2 Movie

2022లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర: పార్ట్ 1 – శివ’ బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకుంది. కానీ, మేకింగ్‌ కోసం ఏకంగా నాలుగేళ్లు టైమ్ తీసుకోవడం, బడ్జెట్ అమాంతం పెరిగిపోవడంతో నిర్మాత కరణ్ జోహార్‌కు ఇది ఆర్థికంగా నష్టంగా మిగిలింది.ఫస్ట్ పార్ట్‌ను కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీలతో కలిసి నిర్మించిన నమిత్ మల్హోత్రా.. ఇప్పుడు సీక్వెల్ నిర్మాణ బాధ్యతలను మాత్రం సింగిల్‌గా తన భుజాలపై వేసుకున్నారు. ఈ పార్ట్ 2 ని కూడా అయాన్ ముఖర్జీనే డైరెక్ట్ చేయబోతున్నారు.

ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో ఇచ్చిన చిన్న హింట్‌ను బేస్ చేసుకుని.. దేవ్, అమృత పాత్రల ఫ్లాష్‌బ్యాక్, వాళ్ల లవ్ స్టోరీ చుట్టే ఈ సెకండ్ పార్ట్ సాగనుందట. నిజానికి గతేడాది అక్టోబర్‌లోనే అయాన్ ముఖర్జీ ఓ హిల్ స్టేషన్‌కు వెళ్లి ఈ స్క్రిప్ట్‌పై వర్క్ చేశారు. ఆయన షేర్ చేసిన ఫోటోల్లో చేతిలో స్క్రిప్ట్ ఉండటం, దానికి పార్ట్ 2, ఓం లాంటి హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేయడంతో అప్పట్లోనే ఫ్యాన్స్‌కు ఓ క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అఫీషియల్‌గా బయటకు రానున్నాయి.

‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus