స్టార్ డైరెక్టర్స్ కు షాక్ ఇచ్చిన రాంచరణ్..!

  • November 2, 2020 / 10:25 PM IST

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ అనే చిత్రం చేస్తున్నాడు చరణ్. ఇందులో అల్లూరి సీతా రామరాజుగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంతో పాటు మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంలో కూడా చరణ్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. అయితే ఈ చిత్రాల తరువాత చరణ్.. ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వంశీ పైడిపల్లి,మోహన్ రాజా(తమిళ దర్శకుడు) చెప్పిన లైన్లకు ఓకే చెప్పాడు.

అయితే వారు ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని మళ్ళీ చరణ్ కు వినిపించాల్సి ఉంది. అటు తరువాత చరణ్ కు అరడజను మంది డైరెక్టర్లు కలిసి కథలు వినిపించారు. అనిల్ రావిపూడి, గౌతమ్ తిన్ననూరి, సందీప్ రెడ్డి, పూరి జగన్నాథ్, వెంకీ కుడుముల, సురేంద్ర రెడ్డి వంటి అగ్ర దర్శకులు వినిపించిన కథలు విన్నాడు. కాబట్టి ఏ డైరెక్టర్ కు ఓకే చెబుతాడు అనేది కచ్చితంగా చెప్పలేము. ఈ మధ్యనే ఈ దర్శకులు మళ్ళీ చరణ్ ను సంప్రదిస్తే..

‘ఒక 6నెలల వరకూ టైం కావాలని.. ‘ఆర్.ఆర్.ఆర్’ ‘ఆచార్య’ పూర్తయ్యేంత వరకూ ఏ నిర్ణయమూ తీసుకోలేనని’ చెప్పాడట. దాంతో ఈ దర్శకులు ఆల్టర్నేట్ ఆప్షన్స్ చూసుకోవడానికి రెడీ అయినట్టు సమాచారం.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus