మహేష్ – అనిల్ రావిపూడి చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్ర..?

  • April 29, 2019 / 05:11 PM IST

‘మహర్షి’ చిత్రం తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26వ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు టాక్ నడుస్తుంది. దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన పూజా కార్యక్రమాలు నిర్వహించి జూన్ నుండీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట.

ఇక ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం విజయశాంతిని తీసుకున్నారట. దీనికోసం విజయశాంతికి భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. ఇక ఇటీవల జగపతిబాబును కూడా ఎంచుకున్నట్టు టాకొచ్చింది. తాజాగా ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నారట. బాహుబలిలో ‘శివగామి’ పాత్ర తో రమ్యకృష్ణ క్రేజ్ మరింత పెరిగింది. పారితోషికం కూడా భారీగానే అందుకుంటుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు ఈమెను తీసుకుంటే అదనపు ఆకర్షణగా మారుతుందనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ ఇలా ప్లాన్ చేశారట. గతంలో మహేష్ నటించిన నాని చిత్రంలో రమ్యకృష్ణ నటించింది. అయితే ఎడిటింగ్లో ఆమె రోల్ కి సంబందించిన సీన్లను డిలీట్ చేసారు. మళ్ళీ 15 ఏళ్ళ తరువాత మహేష్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus