మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుని లైన్లో పెట్టిన రానా?

  • November 10, 2020 / 04:07 PM IST

ఎంత పెద్ద సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ.. ఎందుకో రానాకి రెగ్యులర్ సినిమాలు చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించడు. నాలుగు పాటలు, నాలుగు ఫైట్లతో కూడుకున్న సినిమాలను చేసేసి స్టార్ డం ను సంపాదించుకోవాలని..అలా దానిని కాపాడుకోవాలని అస్సలు తాపత్రయపడడు. హాఫ్ బీట్ మూవీస్ నే చేస్తూ ఉంటాడు. ‘బాహుబలి'(సిరీస్) కు ముందు రానా టేస్ట్ ను పెద్దగా ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. కానీ ‘బాహుబలి’ తరువాత అతను నటిస్తున్న సినిమాలకు మంచి అప్లాజ్ వస్తుండడాన్ని మనం గమనించవచ్చు.

త్వరలోనే రానా ‘అరణ్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల రిలీజ్ కాలేదు. ఇక మరోపక్క ‘విరాట పర్వం’ షూటింగ్ ను కూడా రానా ఫినిష్ చెయ్యాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా చెయ్యడానికి కూడా రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తమిళ దర్శకుడు మిలింద్ రౌ డైరెక్షన్లో క్షుద్ర పూజలు – చేతబడి నేపథ్యంలో సాగే కథాంశంతో సినిమా చెయ్యడానికి రానా రెడీ అవుతున్నాడట.

తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని ‘సురేష్ ప్రొడక్షన్స్’ మరియు ‘విశ్వశాంతి పిక్చర్స్’ బ్యానర్లు కలిసి నిర్మించనున్నాయట.ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus