మరో కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రానా

  • March 15, 2018 / 01:30 PM IST

బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా… ఘాజి, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో విజయాలను దక్కించుకున్నారు. ప్రస్తుతం హాథీ మేరె సాథి అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ చిత్రానికి తెలుగులో అడవి రాముడు అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలై అందరిని ఆశ్చర్యపరిచింది. ఏనుగుతో కలిసి ఉన్న రానా లుక్ చూడగానే అది అరణ్య నేపథ్యంలో సాగే చిత్రంగా అర్ధమైంది. అందుకోసమే థాయిలాండ్ అడవుల్లో షూటింగ్ చేస్తున్నారు.

ఈ చిత్రీకరణలో బిజీగా ఉన్న రానా మరో కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. సిద్ధార్థ్ హీరోగా “గృహం” అనే హారర్ థ్రిల్లర్ ను తీసి అందరి దృష్టిలో పడ్డ  మిళింద్ రాయ్  రీసెంట్ గా రానాకి ఓ లైన్ వినిపించారంట. ఆ లైన్ కొత్తగా అనిపించడంతో, వెంటనే రానా ఓకే చెప్పేశారని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా కథ ఏ జోనర్ లో ఉండబోతోందో అనేది సస్పెన్స్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus