డ్రగ్స్ విషయంపై స్పందించిన రానా

  • July 19, 2017 / 05:21 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కలకలం రేగి వారం రోజులవుతున్నా అలజడి మాత్రం తగ్గడం లేదు. రేపు సిట్ ముందుకు పూరి జగన్నాథ్ హాజరుకావాల్సి. ఆ తర్వాత నోటీసులు అందుకున్న 12 మంది సినీ పరిశ్రమకు చెందిన వారు విచారణకు వెళ్లాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారిలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయులు కూడా ఉన్నారని కొంతమంది ఆరోపించారు. దీనిపై సురేష్ బాబు వివరణ కూడా ఇచ్చారు. తాజాగా ఈ విషయంపై రానా స్పందించారు. ఓ జాతీయ పత్రిక వారితో మాట్లాడారు.

‘‘నేను రోజుకు 20 కిలోమీటర్లు జాగింగ్ చేస్తాను. జిమ్ లో ఎక్కువ సమయం కేటాయిస్తాను. సిక్స్ ప్యాక్ రప్పించుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో అందరికీ తెలుసు. డైట్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటానో నాతో పని చేసిన వాళ్లకు తెలుసు.’’ అని వివరించారు. “బాడీ విషయంలో అంత శ్రద్ధ పెట్టే నేను డ్రగ్స్ ఎలా తీసుకుంటాను. అవి తీసుకుంటే నేనిలా ఉంటానా?”  అని రానా ప్రశించారు. డ్రగ్స్ నోటీసులు తనకు అందలేదని స్పష్టం చేశారు. ఎంతమంది ఆరోపణలు చేసినా .. అబద్ధం నిజమయిపోదని వెల్లడించారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus