‘రణరంగం’ లోని ‘కన్నుకొట్టి’ పాట విడుదల!

  • July 20, 2019 / 07:30 PM IST

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’ ఆగస్టు 15 న విడుదల కానున్న విషయం విదితమే.

ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాటను ఈ రోజు విడుదల చేశారు. ‘కన్ను కొట్టి చూసేనంట సుందరి…మనసు మీటి వెళ్లే నంట మనోహరి’ అనే పల్లవి గల ఈ గీతాన్ని గీత రచయిత కృష్ణ చైతన్య రచించగా, చిత్ర సంగీత దర్శకుడు కార్తీక్ రాడ్రి గ్రూజ్ ఆలపించారు. కథానాయకుడు శర్వానంద్, కల్యాణి ప్రియదర్శిని లపై ఈ గీతాన్ని చిత్రీకరించారు. కధా పరంగా శర్వానంద్, ప్రియదర్శిని ల మధ్య ఉన్న ప్రేమ కు చక్కని వెండితెర రూపం ఈ పాట. కార్తీక్ గళం ఈ పాటకు మరింత కొత్త ధనాన్ని అందించింది. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల అవుతుంది. చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15 , 2019 న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus