వరుసగా మూడో సారి 100కోట్ల క్లబ్ లో చేరనున్నబాలీవుడ్ హీరో !

  • February 20, 2019 / 01:24 PM IST

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కి…. దీపికా పడుకోణె తో పెళ్ళైన తరువాత బాగా కలిసొస్తున్నట్టుంది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘గల్లీ బాయ్’ చిత్రం ఇటీవల విడుదలయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. అలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం… గత వారం ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14 న విదులయ్యింది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుండడం విశేషం.

మొదట్లో ఈ చిత్రం కలెక్షన్లు స్టడీగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు జోరందుకున్నాయి. నిన్న ఒక్క రోజే ఈ చిత్రం ఇండియా వైడ్ గా 8. 65 కోట్లు వసూల్ చేసింది. ఇక 5 రోజులకుగాను దేశవ్యాప్తంగా ఈ చిత్రం 81.10 కోట్ల వసూళ్ళను రాబట్టింది. ఇక మరో రెండు రోజుల్లో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది . ఈ చిత్రం అటు ఓవర్సీస్ లో మంచి కలెక్షన్లు రాబడుతుండడం విశేషం. ఇప్పటి వరకూ అక్కడ 34.31 కోట్లు వసూళ్లను రాబట్టడం విశేషం. రణవీర్ వరుసగా మూడో సారి 100 కోట్ల క్లబ్ లో చేరనుండడం విశేషం. గత ఏడాది విడుదలైన ‘పద్మావత్’ ‘సింబా’ చిత్రాలు ఈ ఫీట్ సాదించగా ఇప్పుడు ఆ లిస్ట్ లో ‘గల్లీ బాయ్’ కూడా చేరనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus